బిగ్బాస్ షోను నిలిపివేయాలని హెచ్చార్సీలో ఫిర్యాదు

Hyderabad: ‘మా టీవీ’లో ఈనెల 21న ప్రారంభం కానున్న ‘బిగ్బాస్’ షో ప్రసారాన్ని నిలిపివేయాలని కోరుతూ ఓయూ ఐకాస ప్రతినిధులు కందుల మధు, వి.వెంకట్, మహేందర్, రామకృష్ణ గురువారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ)లో ఫిర్యాదు దాఖలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బిగ్బాస్ కార్యక్రమం కోసం పోటీదారులను ఎంపిక చేసే క్రమంలో జరిగే స్క్రీన్ టెస్ట్లో మహిళలపై లైంగిక వేధింపులు జరిగాయని ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమం చూస్తే మూడు నెలల పాటు పోటీదారులను పూర్తిగా ఒక భవనంలో నిర్భందించి, వారి ప్రవర్తనను సీసీ కెమెరాల ద్వారా రహాస్యంగా చిత్రీకరిస్తుంటారు. ఆడవాళ్లను లైంగికంగా వాడుకునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.